ఆలయ చైర్మన్ దాశెట్టి సుబ్రహ్మణ్యం
విశాలాంధ్ర ధర్మవరం: పట్టణంలోని బ్రాహ్మణ వీధిలో గల శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి దేవాలయంలో భోగి, కనుమ పండుగ వేడుకల్లో సందర్భంగా సాయంత్రం స్వామివారు మోహిని అలంకరణ ఉత్సవ వేడుకల్లో ఘనంగా ఆలయ కమిటీ చైర్మన్ దాశెట్టి సుబ్రహ్మణ్యం ఆలయ ఈవో వెంకటేశులు, శాశ్వత ఉభయ దాతలు గంజికోట శ్రీధర్ బాబు కిషోర్ బాబు ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా అర్చకులు, కోనేరాచార్యులు, మకరంద బాబు, భాను ప్రకాష్లు స్వామివారిని పట్టు వస్త్రాలతో వివిధ పూలమాలతో చక్కగా అలంకరించిన వైనం భక్తులను విశేషంగా ఆకట్టుకుంది. అనంతరం అర్చకులు శాశ్వత ఉభయదాతలైన వారి పేరిటన ప్రత్యేక పూజలు, అర్చనలు కొనసాగించిన తర్వాత, ఆలయ ఈవో ఆలయ చైర్మన్ చేతుల మీదుగా దాతలను ఘనంగా సత్కరించారు. గత మూడు సంవత్సరాల తర్వాత ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగిందని, కరోనా తర్వాత కొన్ని అనివార్య కార్యాల వలన చేయలేకపోవడం జరిగిందని ఆలయ చైర్మన్ తెలిపారు. తదుపరి చెన్నకేశవ నామ స్మరణ నడుమ స్వామి వారు పట్టణ పురవీధులలో మంగళ వాయిద్యాలు తో ఊరేగించారు. అన్నమయ్య సేవామండలి అధ్యక్షులు పోరాల్ల పుల్లయ్య వారి శిష్య బృందం ఆలపించిన సంకీర్తనలు అందరినీ ముగ్ధుల్ని చేశాయి. ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షులు కుండా చౌడయ్యతో పాటు ఆలయ డైరెక్టర్లు, భక్తాదులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.