విశాలాంధ్ర – పెద్దకడబూరు :(కర్నూలు) : అంగన్వాడీల న్యాయపరమైన డిమాండ్లను పరిష్కారించే వరకు తమ పోరాటం ఆగదని అంగన్వాడీ సంఘం నాయకురాలు జయమ్మ, రత్నమ్మ, చిట్టెమ్మలు హెచ్చరించారు. బుధవారం మండల కేంద్రమైన పెద్దకడబూరులోని స్థానిక మండల తహసీల్దార్ కార్యాలయం వద్ద ఆదోని ప్రధాన రహదారిలో సీఐటియు ఆధ్వర్యంలో ఒంటి కాళిపై నిలుచుండి రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎన్నికల ముందు పాదయాత్ర సందర్భంగా ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో వైసీపీ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని విమర్శించారు. అంగన్వాడీలకు నెలకు 26 వేల రూపాయల కనీస వేతనం ఇవ్వాలని డిమాండ్ చేశారు. అంగన్వాడీల సమస్యలను వెంటనే పరిష్కరించాలని, తమ డిమాండ్లను పరిష్కారించే వరకు తమ పోరాటం ఆగదని వారు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో అంగన్వాడీ కార్యకర్తలు, ఆయాలు పాల్గొన్నారు.