బిజెపి నాయకులు.
విశాలాంధ్ర ధర్మవరం : హిందువుల ఆరాధ్య దైవం అయోధ్య శ్రీరాముని విగ్రహ ప్రతిష్ట కార్యక్రమాన్ని ప్రతి ఒక హిందూబంధువులు భక్తి శ్రద్దలతో జరుపుకోవాలని బిజెపి నాయకులు కోరారు.శుక్రవారం పార్టీ కార్యాలయం లో ఏర్పాటు చేసిన సమావేశం లో వారు మాట్లాడుతూ..ఐదు వందల ఏళ్లుగా ఎదురు చూస్తున్న భారతీయుల కల ఇపుడు సాకారం అవుతోంది అన్నారు. అయోధ్య తీర్థ క్షేత్ర ట్రస్ట్ వారు ఇప్పటికే దేశం లో ఉన్న ప్రతి ఇంటికి శ్రీరాముల వారి అక్షింతలు అందచేశారు అని అన్నారు. దేశ వ్యాప్తంగా ఒక పండుగ వాతావరణం లో శ్రీరాముల వారి విగ్రహ ప్రతిష్ట కార్యక్రమం ఈనెల 22 వతేది నరేంద్ర మోడీ చేతుల మీదుగా జరుగుతుంది అని అన్నారు. ధర్మవరం నియోజకవర్గం లోని ప్రతి గ్రామం లో, ప్రతి దేవాలయం లో భక్తి శ్రద్దలతో, భజన కార్యక్రమాల తో జరుపుకోవాలని తెలిపారు.కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన విధంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా 22 వ తేదీ ని సెలవు దినంగా ప్రకటించాలని కోరారు. ఈ కార్యక్రమం లో అసెంబ్లీ కన్వీనర్ గంగలకుంట. గోపాల్ రెడ్డి,బిజెపి జిల్లా ఉపాధ్యక్షులు సాకే.ఓబిలేసు, జింకా.చంద్రశేఖర్, జిల్లా కార్యవర్గ సభ్యులు భక్తవస్థలం,యువమోర్చ నాయకులు సాకే. చంద్రమహేష్, జల్లా. కార్తీక్, మురళి తదితరులు పాల్గొన్నారు.