మున్సిపల్ కమిషనర్ బండి శేషన్న
విశాలాంధ్ర – ధర్మవరం : పట్టణములో నిర్వహిస్తున్న కుల గణన సర్వే కార్యక్రమాన్ని పారదర్శకంగా, పక్కాగా చేపట్టాలని మున్సిపల్ కమిషనర్ బండి శేషన్న తెలిపారు. ఈ సందర్భంగా వారు కుల గణన జరిగే చోట ఆకస్మిక తనిఖీలు కూడా చేపట్టడం జరిగింది. నేరుగా కుటుంబ సభ్యులతో కుల గణన సర్వే పై అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు. కుల గణన సిబ్బందికి పలు సూచనలు సలహాలు అందించి ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా పక్కాగా చేపట్టాలని వారు ఆదేశించారు. ప్రస్తుత సామాజిక విద్య ఆర్థిక పురోభివృద్ధి తెలుసుకోవడానికి, సముచిత విధాన నిర్ణయాలకు చేపట్టడానికి, అత్యంత ఉపయోగకరమైన పథకాలు రూపు కల్పన చేయడానికి, నిజమైన అర్హత కలిగి ఉండి, సంక్షేమ అభివృద్ధి పొలాలను అందని వారిని గుర్తించి, వారికి లబ్ధి చేకూర్చడానికే సామాజిక న్యాయాన్ని సాధించి సమ సమాజ స్థాపించడానికి ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందని తెలిపారు. కుల గణన సర్వేలో సూపర్వైజర్లు కూడా ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేస్తూ, సిబ్బందికి తగిన సలహాలు సూచనలు ఇవ్వాలని తెలిపారు.