విశాలాంధ్ర- ధర్మవరం: ఇటీవల హైదరాబాద్ చిక్కడపల్లి శ్రీ త్యాగరాయ గాన సభలో శ్రీ శ్రీ కళావేదిక వారు 127వ జాతీయ శతాధిక కవి సమ్మేళమును నిర్వహించారు. ఇందులో శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం పట్టణానికి చెందిన యువ కవి దోరనాల గురు కాశీ విశ్వనాథ్ పాల్గొని తన కవిత్వంలో”సరియైన నాయకున్ని ఎన్నుకో”అన్న కవితలో తన ప్రతిభను చాటి అందర్నీ ముగ్ధుల్ని చేశారు. ఈ సందర్భంగా గురు కాశీ విశ్వనాథ్ కి శ్రీ శ్రీ కళావేదిక చైర్మన్ ప్రతాప్ ఘనంగా సన్మానిస్తూ శ్రీశ్రీ కళావేదిక అవార్డును అందజేశారు. ఈ సందర్భంగా పట్టణ కవులు కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు, ఆత్మీయులు అభినందించి శుభాకాంక్షలు తెలియజేశారు.