విశాలాంధ్ర-రాంబిల్లి(అనకాపల్లి జిల్లా) : తమ డిమాండ్ల సాధనకోసం 42 రోజులుగా చేస్తున్న అంగన్వాడీ కార్యకర్తల సమ్మె ముగిసింది. సోమవారం రాత్రి ప్రభుత్వంతో జరిపిన చర్చలు ఫలవంతం కావడంతో సమ్మె ముగిసినట్లు సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు జి.దేముడు నాయుడు తెలిపారు. ఈ సందర్భంగా మంగళవారం నాడు మండల తాశీల్దార్ కార్యాలయం వద్ద అంగన్వాడీ టీచర్లు, ఆయాలు విజయ చిహ్నం చూపిస్తూ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు జి.దేముడునాయుడు మాట్లాడుతూ అంగన్వాడీలు 42 రోజులు పోరాటంతో ఎట్టకేలకు ప్రభుత్వం అంగన్వాడీ నాయకులతో జరిపిన సఫలం అయ్యాయని, 11 డిమాండ్లలో, పది డిమాండ్లకు ప్రభుత్వం యూనియన్ నాయకులు మధ్య చర్చలు జరిగి ఒప్పుకోవడం జరిగిందని అన్నారు.ఈ కార్యక్రమంలో అంగన్వాడీ ఉద్యోగులు పాల్గొన్నారు.