విశాలాంధ్ర ధర్మవరం:: పట్టణంలోని పాండురంగ స్వామి దేవాలయంలో బుధవారం గోదా రంగనాథ స్వామి కళ్యాణోత్సవం అర్చకులు, భక్తాదులు, ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించుకున్నారు. స్వామివారిని వివిధ రకాల పూలతో పట్టు వస్త్రాలతో అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించిన వైనం భక్తాదులను విశేషంగా ఆకట్టుకుంది. అనంతరం అర్చకులు వేద మంత్రోచ్ఛారణ మధ్య కల్యాణోత్సవాన్ని నిర్వహించారు. తదుపరి వందలాది మంది భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని కూడా నిర్వహించారు. అన్నమయ్య సేవా మండలి అధ్యక్షులు పోరాల్ల పుల్లయ్య శిష్య బృందం అన్నమయ్య సంకీర్తనలు ఆలపించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు తబ్జులు శ్రీనివాసులు నీలమయ్య వాసవి మహిళా మండలి అధ్యక్షురాలు పోడమల రాగిణి, సభ్యులు పాల్గొన్నారు.