విశాలాంధ్ర -పామిడి : ఓటు హక్కును వినియోగించుకుందాం ఆదర్శవంతమైన ప్రజాస్వామ్య వ్యవస్థను తీర్చిదిద్దుకుందాం అని తెలియజేసిన పామిడి తహసిల్దార్ సునీత బాయ్. జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా పామిడి పట్టణ పరిధిలోని అంబేద్కర్ సర్కిల్ నందు మానవహారంగా ఏర్పడ్డారు. ఈ సందర్భంగా తాహసిల్దార్, సర్కిల్ ఇన్స్పెక్టర్ మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో మాత్రమే బావ స్వేచ్ఛకు అవకాశం ఉంటుంది ముఖ్యంగా యువత విద్యార్థులకు ఓటు హక్కును వినియోగించుకోవాలి అధిక శాతం గ్రామీణ ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకుంటారని పట్టణ ప్రాంత ప్రజలు యువత ఓటు హక్కును వినియోగించుకుని రాజ్యాంగాన్ని గౌరవించుకుని, ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాల్సిన అవసరం ఉంది అని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ తాహసిల్దార్ లక్ష్మీనారాయణ రెడ్డి,ఆర్ఐ క్రాంతి కుమార్, మండల సర్వే ప్రసాద్,వీఆర్వో వెంకట రాముడు,జడ్పిటిసి శోభ మధుసూదన్ రెడ్డి, వైఎస్ఆర్సిపి పట్టణ కన్వీనర్ జోజోడే కుమార్, తాహసిల్దార్ కార్యాలయ సిబ్బంది,పోలీస్ సిబ్బంది, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.