కేంద్ర ప్రభుత్వం తనకిచ్చిన అవార్డును దేశంలోని రైతులకు, మహిళలకు, యువతకు అంకితమిస్తున్నానని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు చెప్పారు. ఈ మేరకు ఆయన తన ఎక్స్ ఖాతాలో ఒక పోస్టు చేశారు. ఈ అవార్డు నా బాధ్యతను మరింత పెంచిందని భావిస్తూ నవభారత నిర్మాణం దిశగా ప్రతి ఒక్కరూ కంకణబద్ధులు కావాలని ఆకాంక్షిస్తున్నానన్నారు. శక్తిమంతమైన, ఆత్మనిర్భర భారత నిర్మాణానికి ప్రజలతో కలిసి నడుస్తానని ప్రజలకు సవినయంగా తెలియజేస్తున్నానని పేర్కొన్నారు. అదేవిధంగా దేశ ప్రజలందరికీ వెంకయ్యనాయుడు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. తనతోపాటు పద్మవిభూషణ్ స్వీకరించిన సీనిహీరో, మాజీ కేంద్రమంత్రి చిరంజీవికి కూడా ఆయన అభినందనలు చెప్పారు.