విశాలాంధ్ర, సీతానగరం: మండలంలోని 75వ గణతంత్ర దినోత్సవ వేడుకలు శుక్రవారంనాడు ఘనంగా జరిగాయి. స్తానిక తహశీల్దార్ కార్యాలయంలో తహశీల్దార్ ఎన్వీ రమణ, ఎంపిడిఓ కార్యాలయంలో ఈఓపిఆర్డీ కుమార్ వర్మ ,పోలీస్ స్టేషన్లో , ఏ ఎస్ఐ లంక శ్రీనివాసరావు,ప్రాదమిక ఆరోగ్య కేంద్రాలలో, ఆయుర్వేద కేంద్రాలలో, పశువైద్య కేంద్రాల్లో వైద్యులు ఉషారాణి,పావని,రాధాకాంత్, హేమాక్షిలు, చింతాడ దీనకుమార్, ఎస్ రామారావు, అప్పయ్యపేట విద్యుత్ కార్యాలయంలో ఏఈ అరసాడ జగన్మోహన రావు,ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ప్రిన్సిపాల్ దాసరి త్రినాథ్, జోగమ్మపేట ప్రతిభా కళాశాలలో ప్రిన్సిపాల్ పోల వెంకటనాయుడు, సాంఘీక సంక్షేమ గురుకుల పాఠశాలలో ప్రిన్సిపాల్ కె.ఈశ్వరరావు,కేజీబీవీ బాలికల పాఠశాలలో ప్రిన్సిపాల్ జొన్నాడ సంధ్య,సీతానగరం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో హెచ్ఎం ఇల్లా ప్రసన్న లక్ష్మి, బూర్జ ఉన్నత పాఠశాలలో హెచ్ ఎం మీసాల సన్యాసినాయుడు,మరిపివలస ఉన్నత పాఠశాలలోఇంచార్జి హెచ్ఎం వోలేటి తవిటి నాయుడు, నిడగల్లు ఉన్నత పాఠశాలలో హెచ్ఎం ఎం శివున్నాయుడు, గాదెలవలస ఉన్నత పాఠశాలలో హెచ్ఎం మూడడ్ల శంకరరావు, కోటసీతారాంపురం పాటశాలలో హెచ్ఎం చుక్క శ్రీదేవి , గెడ్డలుప్పి కృషి విధ్యానికేతన్ లో కరస్పాండెంట్ డి.శ్రీనివాసరావు, హోలీ క్రాస్ పాటశాల, డివైన్ పాటశాలలో జెండానుఆయాపాటశాలల హెచ్ఎం లు ఆవిష్కరణ చేశారు.ఈకార్యక్రమంలో మండల అధికారులు సూరిదేముడు, ఎం వెంకటరమణ, ఏపిం తేలుశ్రీరాములు నాయుడు, హౌసింగ్ జెఈ జానకీరాం, డిటి చిట్టెమ్మ , ఆర్ ఐ శ్రీనుబాబు,తదితరులు పాల్గొన్నారు.అన్నిసచివాలయాలలో, వివిధ గ్రామాల్లోని పాటశాలలో, వివిధ సంస్థలలో గణతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు.నేడు అన్నిచోట్ల అధికారులు జాతీయపతాకాన్ని ఆవిష్కరించగా ప్రజాప్రతినిధులు పాల్గొని జెండా పండుగను తిలకించారు.ఎంపిపి బలగ రవణమ్మ,జెడ్
పి టి సి మామిడి బాబ్జి, వైస్ ఎంపిపి సూర్యనారాయణ, మండల వైఎస్సార్సీపీ అధ్యక్షుడు బొంగు చిట్టిరాజు, ఎంపిపి ప్రతినిది బలగ శ్రీరాములు,సర్పంచులు, ఎంపీటీసీలు,ప్రజలు , వివిధ పార్టీల నాయకులు,కార్యాలయాలఉద్యోగులు, సచివాలయంల సిబ్బందిహాజరయ్యారు.కళాశాలలో,పాటశాలలో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. పలు పోటీలలో విజేతలకు బహుమతులు అందజేశారు