విశాలాంధ్ర – చోడవరం(అనకాపల్లి జిల్లా) : తే.26.01.2024ది. చోడవరం శ్రీ గణేష్ గాయత్రి బ్రాహ్మణ సేవా ట్రస్ట్ తరపున నిర్వహించు సేవా కార్యక్రమాలకు గాను రూ.1,01,116లను చెక్కును కందర్ప కృష్ణ మూర్తి (కిష్టప్ప) గురువారం సంఘ అధ్యక్ష కార్యదర్శులకు అందేజేశారు. గాయత్రి గాయత్రి బ్రాహ్మణ సేవా సంఘం భవనంలో ఏర్పాటు చేసిన సమావేశంలో అధ్యక్షుడు శ్యాం ప్రసాద్ కార్యదర్శి వింజమూరు శంకర్ లకు ఈ చెక్కును అందజేశారు. ఈ సందర్భంగా గౌరవ కార్యదర్శి కిష్టప్ప మాట్లాడుతూ మూలధనం కార్పస్ ఫండ్ ఏర్పాటుతో సంఘ సభ్యులకు అత్యవసర సమయాలలో విద్య, వైద్యం ఆపన్న కాలంలో తగిన సహాయం అందుతుందని తెలిపారు. అర్హులైన లబ్ధిదారులను గుర్తించేందుకు వివిధ స్క్రీనింగ్ కమిటీలను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో విశ్రాంత ఉపాధ్యాయుడు గుంటూరు సత్యనారాయణ గోటేటి సీతారామ మూర్తి ప్రముఖ న్యాయవాది కందర్ప రమేష్, ఎస్.ఎన్.సింగ్ తదితరులు పాల్గొన్నారు.