విశాలాంధ్ర- ఉంగుటూరు( ఏలూరు జిల్లా): ఉంగుటూరు మండల మానవతా శాఖ ఆధ్వర్యంలో కైకరం ఎంపీపీ స్కూల్ కొత్తూరు నందు పాఠశాల కావలసిన గ్రీన్ చాక్ బోర్డు మానవతా వారి ఆర్థిక సౌజన్యంతో శనివారం ఏర్పాటు చేసారు . ఈ కార్యక్రమంలో మానవత రీజనల్ చైర్మన్ పుప్పాల గోపి , మండల అధ్యక్షులు గంజి రవి, ఒకటో వార్డు మెంబర్ శానం సత్తిబాబు,జిల్లా విజిలెన్స్ ఫుడ్ కమిటీ సభ్యులు కోనే వీరవెంకట సత్యనారాయణ, ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ మోనిటరింగ్ కమిటీ సభ్యులు గంజి ప్రభాకర్ రావు, గ్రామ ఎంపీటీసీ పంతులు వెంకన్న బాబు, వార్డు సభ్యులు నత్త వెంకటేశ్వర్ రావు, సంపత్ గణేష్, చిన్నం అనిల్ కుమార్,కనమాల సురేష్, బలే రామయ్య, విద్య కమిటీ చైర్మన్, ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.