విశాలాంధ్ర ధర్మవరం:: పట్టణంలోని సుందరయ్య నగర్ లో మున్సిపల్ పార్కును, ఓపెన్ జిమ్మును ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి ప్రారంభించారు. ఏళ్ల తరబడి సుందరయ్య నగర్ వాసుల చిరకాల కోరిక తీరినందుకు వార్డు ప్రజలు సంతోషాన్ని వ్యక్తం చేశారు. అనంతరం ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి మాట్లాడుతూ సుందరయ్య నగర్ లో మొత్తం ఎనిమిది లక్షలతో ఈ పార్కు జిమ్మును ఏర్పాటు చేయడం జరిగిందని, ఇందులో మున్సిపల్ నిదుల నుంచి నాలుగు లక్షలు, దాతలు కోటిరెడ్డి గంగిరెడ్డి శాంతమ్మల జ్ఞాపకార్థం వార్డు కౌన్సిలర్ కోటిరెడ్డి సుజాత, కోటిరెడ్డి బాల్రెడ్డిలు ఇవ్వడం పట్ల వారిని ఎమ్మెల్యే అభినందించి కృతజ్ఞతలు తెలియజేశారు. కాలనీవాసులు ఎమ్మెల్యే కేతిరెడ్డికి పూల వర్షం కురిపించి ఘనంగా స్వాగతం పలికారు. జిమ్ము, పార్కులోని పలు పరికరాలను ఎమ్మెల్యే పరిశీలించారు. అనంతరం చిన్నపిల్లలతో జిమ్ములో సాధన చేయించారు. మున్సిపల్ రిజర్వ్ స్థలాలు అన్యాక్రాంతం కాకుండా మున్సిపాలిటీ దాతల సహకారంతో ఈ పార్కు ఓపెన్ జిమ్ ఏర్పాటు చేయడం నాకెంతో సంతోషంగా ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ కాచెర్ల లక్ష్మి, వైస్ చైర్మన్లు జయరాంరెడ్డి, మున్సిపల్ కమిషనర్ బండి శేషన్న, సీఐ సుబ్రహ్మణ్యం, వార్డు కౌన్సిలర్ కోటిరెడ్డి సుజాత, వార్డు ఇన్చార్జ్ కోటిరెడ్డి బాల్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.