జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలకం మధుసూదన్ రెడ్డి
విశాలాంధ్ర ధర్మవరం::శ్రీ సత్య సాయి జిల్లా నియోజకవర్గంలోని మండలం పరిధిలోగల గ్రామాలలో ఓటరు జాబితాను క్షుణ్ణంగా బూత్ కమిటీ సభ్యులు పరిశీలించాలని జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలకం మధుసూదన్ రెడ్డి పేర్కొన్నారు. ఈ సందర్భంగా వారు నియోజకవర్గంలోని ముదిగుబ్బ, తాడిమర్రి, బత్తలపల్లి మండలాల బూత్ కమిటీ సభ్యులతో ముఖ్య సమావేశాన్ని నిర్వహించారు. అనంతరం చిలక మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ గ్రామాల వారీగా ఓటరు జాబితాను సేకరించిన వారు దొంగ ఓట్లు, డబుల్ ఓట్లు, మృతి చెందిన వారి ఓట్లు ఉన్న ఎడల వాటిని గుర్తించి తొలగించే దిశగా ఎలక్షన్ కమిషన్ దృష్టికి తీసుకు వెళ్లాలని తెలిపారు. తదుపరి బత్తలపల్లి కమిటీ ను నియమించారు. ఈ కమిటీలో అధ్యక్షులుగా పురం శెట్టి రవి, ఉపాధ్యక్షులుగా దాడి తోట కృష్ణయ్య ,ఓబిరెడ్డి, ప్రధాన కార్యదర్శులుగా ధారా గంగాధర, గంగయ్య, పెద్దన్న ,ఇండ్ల రామాంజనేయులు, కార్యదర్శులుగా శ్రీనివాసులు, ఇండ్ల గోవర్ధన్, చెన్నారెడ్డి, డి.మధు, పి. మధు, దేవరకొండ నరసింహ, సంయుక్త కార్యదర్శిగా కుళ్లాయప్ప, గొంగటి హరి, రాధాకృష్ణ,నరేంద్ర, వంశీ, చెన్నయ్య, సాయి మోహన్, గోగుల రాజు, ఆర్వేటి రామానంద లకు నియామక పత్రాలను వారు అందజేశారు. ఈ కార్యక్రమంలో ముదిగుబ్బ మండల కన్వీనర్ గుర్రం జయచంద్ర, మత్స్యకార వికాస విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బెస్త శ్రీనివాసులు, మాజీ కౌన్సిలర్ వెంకటరెడ్డి, మండల ఉపాధ్యక్షులు జి. జీవి, పట్టణ నాయకులు అడ్డగిరి శ్యామ్ కుమార్, జిల్లా సంయుక్త కార్యదర్శి జయ రామాంజనేయులు, కార్యనిర్వాహన కమిటీ సభ్యులు కోటికి రామాంజి, శివశంకర్ రెడ్డి, ప్రతాప్ తదితరులు పాల్గొన్నారు.