విశాలాంధ్ర -ధర్మవరం:: పట్టణంలోని 18 వ వార్డు కౌన్సిలర్ పెద్దకోట్ల ఉషారాణి, 18వ వార్డు వైసిపి ఇన్చార్జ్ కాలంగి శ్రీనివాసులు యొక్క ఏకైక పుత్రిక పెద్దకోట్ల కాలంగి మనీషా వైయస్ యూనివర్సిటీ లోని ఎండిఎస్, పేదో దొంటిక్స్ అండ్ ప్రైవేటు డెంటిస్ట్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్సు నందు రాష్ట్రంలో మొదటి ర్యాంకు సాధించడం జరిగింది. గీతం యూనివర్సిటీ నందు జరిగిన కాన్వకేషన్ లో మధ్యప్రదేశ్ మెడికల్ యూనివర్సిటీ వైస్ ఛాన్సిలర్ డాక్టర్ అశోక్ మలహోత్ర చేతులమీదుగా గోల్డ్ మెడలను అందుకోవడం జరిగింది. ఈ సందర్భంగా తల్లిదండ్రులు మాట్లాడుతూ తన కుమార్తె కాలంగి మనీషా చిన్నతనం నుంచి చదువు పట్ల ఆసక్తి చూపేదని, నేడు ధర్మవరం కీర్తి ప్రతిష్టలను ఇనుమడింప చేయడం మాకు చాలా సంతోషంగా ఉందని వారు హర్షం వ్యక్తం చేశారు.