విశాలాంధ్ర- ధర్మవరం:: పట్టణములోని కే హెచ్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలోని ఎన్ఎస్ఎస్ ప్రత్యేక శిబిరం గత కొన్ని రోజులుగా మండల పరిధిలోని గొట్లురు గ్రామంలో కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా చివరి రోజు ఆ గ్రామంలో నిర్వహించారు. అనంతరం ప్రిన్సిపాల్ ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ ఈ చివరి కార్యక్రమానికి పంచాయతీ పిట్టనరసమ్మ, పిట్ట నరసింహులు అధ్యక్షతన జరిగిందని, క్రమశిక్షణకు మారుపేరు సేవారంగంలో ఎన్ఎస్ఎస్ ఎప్పుడూ కూడా ముందు ఉంటుందని తెలిపారు. కాలేజీ నుండి ఫ్రీ పబ్లిక్ డే, రెడ్ క్రాస్, నేషనల్ ఇంటిగ్రేషన్ క్యాంప్ శిక్షణలో మన విద్యార్థులు ప్రతిభ ఎనలేనిదని తెలిపారు. మీకు ప్రతిభ ఉంటే కాలేజీ మీ వెంటే ఉంటుందని వారు తెలిపారు. సర్పంచ్ పిట్ట నరసమ్మ, గ్రామ కార్యదర్శి గణేష్ రెడ్డి మాట్లాడుతూ మా గ్రామంలో ఎన్ఎస్ఎస్ ప్రత్యేక శిబిరం నిర్వహించడం మాకెంతో సంతోషంగా ఉందని ఎన్ఎస్ఎస్ వాలంటీర్లకు రుణపడి ఉంటామని తెలిపారు. సమాజంలో సేవ చేసే గుణం అలవర్చుకోవాలని ప్రస్తుతం యువత మంచి మార్గంలో వెళ్లాలని వారు తెలియజేశారు. అనంతరం ఎన్ఎస్ఎస్ వాలంటీర్లకు, కళాశాల ప్రిన్సిపాల్కు, అధ్యాపకులకు కృతజ్ఞతలు తెలియజేశారు. అనంతరం సచివాలయ ఆవరణములో మొక్కలను కూడా నాటడం జరిగింది. ఈ కార్యక్రమంలో అధ్యాపకులు షమీవుల్ల ,ఆనందు, మండల సాయి అధికారులు నీరజ, ఏఎన్ఎంలు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.