దుస్సాలువాతో సత్కరించిన రెవిన్యూ సిబ్బంది
విశాలాంధ్ర – చింతపల్లి (అల్లూరి సీతారామరాజు జిల్లా) :- మండలంలో తహసిల్దార్ చింతకాయల లత్షా పాత్రుడు చేసిన సేవలు ఎనలేనివని రెవెన్యూ ఇన్స్పెక్టర్ గిడ్డి రాజ్ కుమార్ అన్నారు. బదిలీపై వెళ్తున్న లత్షా పాత్రుడుకు రెవిన్యూ సిబ్బంది గురువారం ఘనంగా వీడ్కోలు సభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయనను దుస్సాలువతో సత్కరించారు. తక్కువ కాలంలో సిబ్బంది తో ఆయన కలసి పనిచేసిన విధానాన్ని, ప్రతి ఒక్కరితో కలసిపోయే మంచితనాన్ని సిబ్బంది గుర్తు చేసుకున్నారు. ఆయన పని చేసిన ఆరు నెలల వ్యవధిలోనే సిబ్బందితోనే గాక ప్రజలతోనూ మంచి తహసీల్దారుగా గుర్తింపు తెచ్చుకున్నారని వక్తలు కొనియాడారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ ఇన్స్పెక్టర్లు, వీఆర్వోలు, వీఆర్ఏలు, సిబ్బంది పాల్గొన్నారు.