చింతపల్లి డిప్యూటీ తహశీల్దార్ రాజ్ కుమార్
విశాలాంధ్ర – చింతపల్లి(అల్లూరి సీతారామరాజు జిల్లా) : – ఎలక్ట్రానిక్ ఓటింగ్ వీ వీ ప్యాడ్లపై ఓటర్లకు అవగాహన కలిగించాలని డిప్యూటీ తహశీల్దార్ గిడ్డి రాజ్ కుమార్ అన్నారు. శుక్రవారం మండల కార్యాలయం ఆవరణలో ఎన్నికల కమిషన్ సీనియర్ అసిస్టెంట్ సాగిన చిన్నయ్య పడాల్, జూనియర్ అసిస్టెంట్ డివి గాంధీ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన ఆయన ఎలక్ట్రానిక్ ఓటింగ్ వివి ప్యాడ్లను క్షుణ్ణంగా పరిశీలించారు. అనంతరం రెవెన్యూ సిబ్బందికి ఎలక్ట్రానిక్ ఓటింగ్ పై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఓటు హక్కు కలిగిన వినియోగదారులందరికీ ఓట్లు వేసేటప్పుడు తప్పులు దొర్లకుండా ఉండేందుకు జనసంచారం తిరిగే ముఖ్య కూడలీ, సచివాలయాల కేంద్రాలలో అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని, సచివాలయాల సిబ్బంది అత్యధిక సంఖ్యలో ఓటు హక్కు కలిగిన అందర్నీ తీసుకువచ్చి ఓటు హక్కు ఏ విధంగా వినియోగించుకోవాలనే దానిపై అవగాహన తొలగించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో వీఆర్వోలు ఎస్ కృష్ణారావు, టి రామారావు, ఎస్ విష్ణు, రెవెన్యూ శాఖ సిబ్బంది పాల్గొన్నారు.