విశాలాంధ్ర-రాప్తాడు : గ్రామీణ ప్రాంత ప్రజలకు నాణ్యమైన వైద్యం అందించడమే లక్ష్యమని జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ ప్రోగ్రామ్ ఆఫీసర్ డాక్టర్ సుజాత, డీపీఎంఓ డాక్టర్ రవిశంకర్ తెలిపారు. మండలంలోని మరూరు గ్రామంలో జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని రాప్తాడు పీహెచ్సీ డాక్టర్ శివకృష్ణ ఆధ్వర్యంలో నిర్వహించారు. మందుల వివరాలు,స్పాట్ సర్వే, లాబ్ పరీక్షలు, కేస్ షీట్స్ ను, కంటి పరీక్ష కేంద్రాన్ని పరిశీలించి సంతృప్తి చెందారు. అదే విధంగా పేషంట్స్ తో మాట్లాడారు. వారు మాట్లాడుతూ గ్రామాలలో ప్రజలకు ఆరోగ్య భద్రత కల్పించేందుకు సీఎం జగన్ ఆరోగ్య సురక్ష క్యాంపులు నిర్వహిస్తున్నారన్నారు.
శిబిరానికి వచ్చిన వ్యాధిగ్రస్తులకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించి మద్దులు పంపిణీ చేశారు. వ్యాధి తీవ్రత ఎక్కువగా ఉన్నవారిని జిల్లా ఆసుపత్రికి రెఫర్ చేశారు.
ఈ కార్యక్రమంలో సిహెచ్ఓ శివప్రసాద్, సూపర్వైజర్ నరసింహ, ఫార్మసిస్ట్ మూర్తి, పంచాయతీ కార్యదర్శి వరలక్ష్మి, హెల్త్ అసిస్టెంట్లు ఎంఎల్ హెచ్ పీలు, ఆశా కార్యకర్తలు, పాల్గొన్నారు.