విశాలాంధ్ర ధర్మవరం:: పట్టణంలోని మారుతీ నగర్ పోతుకుంట పోలీస్ స్టేషన్ వెనుక నివాసం ఉంటున్న గడ్డం వెంకటేష్ గత కొన్ని నెలలుగా పక్షపాతంతో బాధపడుతూ చికిత్స చేయించుకోవడానికి డబ్బు లేని స్థితిలో ఉన్నాడు. ఈ సమాచారాన్ని తారక్ చేయుట ట్రస్ట్ అధ్యక్షులు రామాంజనేయులు కు అందించారు. సమాచారం అందుకున్న తారచైత ట్రస్ట్ అధ్యక్షులు సభ్యులు కలిసి వెంటనే స్పందించి గడ్డం వెంకటేష్ యొక్క పరిస్థితిని చూసి, రెండు నెలలకు సరిపడు సరుకులను ఇస్తూ చికిత్స కోసం పదివేల రూపాయలు నగదు సహాయాన్ని వారు అందించారు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులు తారక్ చైతన్ ట్రస్ట్ కు కృతజ్ఞతలు తెలియజేశారు. ఇప్పటికే పట్టణము గ్రామీణ ప్రాంతాలలో గల అనాధలను పేదవాళ్లను ఆదుకుంటూ తమకు తోచిన సహాయాన్ని ట్రస్టు తరఫున ఆర్థిక సహాయం చేయడం పట్ల అధికారులు పట్టణ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.