విశాలాంధ్ర – ధర్మవరం:: ధర్మవరం నూతన ఆర్డీవో గా ఎం. వెంకట శివారెడ్డి సోమవారం ఆర్డిఓ కార్యాలయంలో పదవీ బాధ్యతలు స్వీకరించారు. గతంలో ఉన్న రమేష్ రెడ్డి సీసీఎల్ఏ విజయవాడలో రిపోర్టు చేసుకోవాలని ఎన్నికల అధికారులు ద్వారా ఉత్తర్వులతో వెళ్లడం జరిగింది. వీరి స్థానంలో గుంటూరు జిల్లా ప్రాజెక్ట్ డైరెక్టర్ డ్వామా అధికారి ఎం. వెంకట శివారెడ్డి ధర్మవరం ఆర్డీవో గా బదిలీ అయ్యారు. అనంతరం ఆర్డీవో మాట్లాడుతూ ధర్మవరం డివిజన్లోని ఏడు మండలాలకు నూతన తహసిల్దార్లు పదవీ బాధ్యతలు చేపట్టడం జరిగిందని,ఎన్నికలను సమర్థవంతంగా నిర్వర్తించేందుకు తనవంతుగా అధికారులు సిబ్బంది ద్వారా కృషి చేస్తానని తెలిపారు. అదేవిధంగా డివిజన్లో ఏడు మండలాల ప్రజలందరికీ ఓటు హక్కును కల్పించే విధంగా కృషి చేస్తారని తెలిపారు. అనంతరం ఆర్డీవో కార్యాలయ అధికారులు, సిబ్బంది వెంకట శివారెడ్డికి శుభాకాంక్షలు తెలియజేశారు. నూతన ఎమ్మార్వో గా ఎన్ఏ రమేష్ పదవీ బాధ్యతల స్వీకరణ:: ధర్మవరం తాసిల్దారుగా కడప జిల్లా ఒంటిమిట్ట మండలంలో తాసిల్దారుగా నిర్వర్తిస్తున్న రమేషును ధర్మవరం తాసిల్దారుగా బదిలీ చేశారు.. గతంలో ఉన్న యుగేశ్వరిదేవి స్థానంలో రమేష్ రావడం జరిగింది. అంతవరకు ఇంచార్జ్ తాసిల్దారుగా ఈశ్వరయ్య కొనసాగారు. అనంతరం రమేష్ మాట్లాడుతూ మర్యాదపూర్వకంగా ఆర్డిఓ వెంకట శివారెడ్డిని కలవడం జరిగిందని, అందరి సహాయ సహకారాలతో పట్టణ ప్రజల సమస్యలను పరిష్కరిస్తానని తెలిపారు. అదేవిధంగా 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరు ఓటు హక్కును నమోదు చేసుకోవాలని, ఓటు లేని వారు, చేర్పులు, మార్పులు, బదిలీ కావలసినవారు ఫారం–6,7,8 దరఖాస్తులలో భర్తీ చేయాలని, తదుపరి బిఎల్ఓ,, సూపర్వైజర్ల ద్వారా విచారణ చేపట్టి ఓటు హక్కు వచ్చే విధంగా చర్యలు చేపడతారని తెలిపారు. తదుపరి తాసిల్దార్ కార్యాలయంలోని అధికారులకు సిబ్బందికి సమావేశాన్ని నిర్వహించి, ప్రజా సమస్యలను పరిష్కరించుటలో అందరూ చిత్తశుద్ధితో తమ విధులను కొనసాగించాలని, ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రజల వద్దకు చేరేంతవరకు నిరంతరం తమ విధులను నిర్వర్తించాలని తెలిపారు. అనంతరం కార్యాలయ అధికారులు సిబ్బంది రమేష్ కు అభినందన శుభాకాంక్షలు తెలియజేశారు.