విశాలాంధ్ర – పామిడి : అబ్దుల్ కలాం స్వచ్ఛంద సేవ సంస్థలో ఎంత బిజీగా ఉన్నా సరే ఆపదలో ఉన్నవారికి రక్తం ఇవ్వడం కోసం ఎంత దూరమైనా వెళ్లాల్సిందే. ఒక సారి కాదు, రెండు సార్లు కాదు. ఇప్పటికీ ఆయన 94 సార్లు రక్తదానం చేశాడు. ఎంతో మందికి రక్తం ఇచ్చి ప్రాణదాతగా నిలిచాడు. అనంతపురం జిల్లా పామిడి మండలం అబ్దుల్ కలాం స్వచ్ఛంద సేవ సంస్థ సభ్యులు కొని దశాబ్దాలుగా రక్తదానం చేస్తున్నాడు. బత్తలపల్లి ఆర్డిటి హాస్పిటల్ నందు ఒక పేషెంట్ కు బి పాజిటివ్ రక్తం అవసరం కాగా వారు వెంటనే అబ్దుల్ కలాం స్వచ్ఛంద సేవా సంస్థ సభ్యుడు పీటర్ విజయ్ ను సంప్రదించగా వెంటనే వెళ్లి ఆ పేషెంట్ కు రక్తదానం చేయడం జరిగింది. పేషెంట్ తరఫున బంధువులు ఎంతో సంతోషపడ్డారు. ఈ సందర్భంగా పీటర్ విజయ్ మాట్లాడుతూ మనం రక్తదానం చేసే సమయం కేవలం ఐదు నిమిషాలు. కానీ ఆ రక్తం తీసుకున్నవారు ఆయుషుకాలం 100 సంవత్సరాలు ఉంటుంది, ఎంత సంతోషం కదా, మీకు ఎవరికైనా ఎక్కడైనా ఎప్పుడైనా ఏ సమయంలో నైనా రక్తం అవసరమైతే దయచేసి ఈ 9963296475 కాల్ చేయలని తెలియజేశాడు.