విశాలాంధ్ర – విజయనగరం టౌన్ జిల్లా : విద్యాశాఖ అధికారిగా శుక్రవారం ఎన్ ప్రేమ్ కుమార్ బాధ్యతలు చేపట్టారు ఈయన ఇంతవరకు మన్యం జిల్లా ఎఫ్ ఏ సి డి ఈ ఓ మన్యం జిల్లాలో పనిచేసే జిల్లాకు పూర్తిస్థాయి డీఈవోగా బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా జిల్లా విద్యాశాఖ అధికారులు, తదితరులు ఆయనను అభినందించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రానున్న పదవ తరగతి పరీక్షల్లో ప్రస్తుతం ఉన్న తీరును అవలంబిస్తూ ఉత్తమ ఉత్తీర్ణతకు ప్రయత్నం చేస్తామన్నారు. జిల్లాలో ఉన్న విద్యారంగ సమస్యలు పరిష్కారం కోసం తమ వంతు కృషి చేస్తానన్నారు. రానున్న కాలంలో ప్రతి కార్పొరేట్, ప్రైవేట్ పాఠశాలను సందర్శించడం జరుగుతుందన్నారు. అనుమతులు లేని పాఠశాలలపై తగిన చర్యలు తీసుకుంటామన్నారు. కార్యాలయ సిబ్బంది, ఉపాధ్యాయులతో కలిసి జిల్లాకు మంచి పేరు తీసుకు వచ్చేందుకు ప్రయత్నం చేస్తామన్నారు