విశాలాంధ్ర, భీమిలి : జనసేన వార్డు అధ్యక్షురాలు పరిమి భువనేశ్వరి శనివారం తగరపువలస జీవీఎంసీ ఒకటో వార్డు బంగ్లామెట్ట లో ప్రమాద గురైన బాధితుడిని పరిశీలించిన మీదట మందులు ఖర్చు నిమిత్తం దాతలు సహాయ సహకారాలతో కొంతమేర నగదు సహాయం చేశారు. అనంతరం వారి కుటుంబానికి
అవసరం మేర నిత్యావసర వస్తువులతో పాటు అండగా ఉంటామని బాధిత కుటుంబానికి భరోసా కల్పించారు. అనంతరం అంగన్వాడి సెంటర్లు పరిశీలించారు ఈ కార్యక్రమంలో అధ్యక్షురాలతో పాటు వీర మహిళలు స్థానిక నాయకులు పాల్గొన్నారు.