విశాలాంధ్ర – చింతపల్లి(అల్లూరి సీతారామరాజు జిల్లా) :- మండలంలోని కుడుముసారి పంచాయతీ సంపంగి పుట్టు, భీమనాపల్లి గ్రామాల సరిహద్దులో సోమవారం చోటు చేసుకున్న జీపు బోల్తా గతంలో మృతి చెందిన మెరికల గ్రామానికి చెందిన అప్పారావు, జర్త చిన్నమ్మి మృతి చెందిన విషయాన్ని తెలుసుకున్న వైకాపా పాడేరు నియోజకవర్గం సమన్వయకర్త మత్స్యరాస విశ్వేశ్వర రాజు మంగళవారం చింతపల్లి చేరుకొని స్థానిక ప్రజా ప్రతినిధులతో కలిసి మరణించిన కుటుంబ సభ్యులను పరామర్శించి దహన సంస్కారాలు నిమిత్తం ఆర్థిక సహాయం అందించారు.
ఈ సంఘటనలో గాయపడి పాడేరు జిల్లా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను అక్కడికి వెళ్లి దుర్ఘటనపై ఆరా తీశారు. వైద్యులతో మాట్లాడి ఎవరికీ ఎటువంటి ఇబ్బంది కలగకుండా మెరుగైన వైద్యం అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎంపీపీ అనూష దేవి,
జెడ్పీటీసీ బాలయ్య, మాజీ ఎంపీపీ బాబురావు, జి.కే వీధి మండల పార్టీ అధ్యక్షులు లక్ష్మణ్, బలపం సర్పంచ్ రమేష్ నాయుడు, కుడుము సారి వార్డు సభ్యుడు బోండా సింహాచలం, వైకాపా నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.