.విశాలాంధ్ర- పామిడి : రాప్తాడు సిద్ధం సభలో ఆంధ్రజ్యోతి ఫోటోగ్రాఫర్ పై వైసీపీ నాయకులు చేసిన దాడిని ఖండిస్తూ పామిడి తాహాసిల్దార్ కార్యాలయం నందు డిప్యూటీ తాహాసిల్దార్ లక్ష్మీనారాయణ రెడ్డి కి వినతి పత్రం అందజేయడం జరిగినది.ఈ సందర్భంగా తెలుగుదేశం నాయకులు మాట్లాడుతూ పత్రికా విలేకరుల పై దాడి చేసిన వారిని వెంటనే అరెస్ట్ చేసి తగు చర్యలు తీసుకోవాలి, సిద్ధం సభ కాదు పాత్రికేయుల దాడి సభ ఈ సిద్ధం సభను వైసీపీ నడిపించలేదు. మందు, మాంసం, డబ్బులు, అధికార బలం,అన్నీ కలిపి నడిపించాయి.ఆర్టీసీ బస్సులు, ప్రైవేట్ పాఠశాలలను వీధి వీధికీ, ఊరూరుకీ పంపి జనాన్ని బలవంతంగా తరలించారు అని అన్నారు.ఈ కార్యక్రమం లో పల్లె శ్రీనివాసులు, గుర్రం నారాయణ స్వామి, వెంకటేష్, రాజేష్ నాయక్, ఆనంద్ బాబు, సుదర్శన్ బాబు,మల్లేశ్వర రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.