విశాలాంధ్ర, సీతానగరం :అనంతపురం జిల్లాలోని రాప్తాడులో ఆదివారం జరిగిన సిద్దం సభలో ఆంధ్రజ్యోతి ఫోటో గ్రాఫర్ శ్రీకృష్ణపై వైఎస్సార్సీపీ కార్యకర్తలు చేసిన దాడి అమానుషమని మండల పత్రికా విలేకరులు అన్నారు.సోమవారం స్థానిక తహసీల్దార్ కార్యాలయం ఎదుట బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.మీడియాపై దాడిచేసిన వారిని శిక్షించాలని కోరారు.డిప్యూటి తహశీల్దార్ పప్పల చిట్టెమ్మకు వినతిపత్రాన్ని అందజేశారు.ఈకార్యక్రమంలోఈనాడు, విశాలాంధ్ర, ఆంధ్రజ్యోతి,ప్రజాశక్తి, ఆంధ్ర ప్రభ పత్రికావిలేకరులు ఎం కృష్ణమూర్తి, ఎం రమేష్, సి హెచ్ వెంకటరమణ, డి నారాయణరావు, పిళ్లి సతీశ్ లు పాల్గొన్నారు.