బార్ అసోసియేషన్ అధ్యక్షులు సుబ్బారావు
విశాలాంధ్ర ధర్మవరం:: బడుగు బలహీన వర్గాల వారికి సమ న్యాయం చేయడమే ప్రపంచ సామాజిక న్యాయ దినోత్సవం యొక్క ముఖ్య లక్ష్యం అని బార్ అసోసియేషన్ అధ్యక్షుడు సుబ్బారావు తెలిపారు. ఈ సందర్భంగా వారు ప్రపంచ సామాజిక న్యాయ దినోత్సవం గూర్చి పలు విషయాలను వెల్లడించారు. అనంతరం వారు మాట్లాడుతూ పేదలకు ఉచిత న్యాయ సలహా సేవలు కోర్టు ద్వారా పొందవచ్చునని, అన్ని విధాలుగా అందరితో సమానంగా ఇది ఉపయోగపడుతుందని తెలిపారు. పేదల ఆర్థిక అసమానతలు నుండి ముందుకు వెళ్లి, వారి భద్రత కొరకు ఇది ఉపయోగపడుతుందని తెలిపారు. బడుగు బలహీన వర్గాల ఆర్థిక అసమానతలు తొలగించి, అందరి ఐక్యత కొరకే ఈ న్యాయస్థానం పనిచేయడమే ముఖ్య ఉద్దేశం అని తెలిపారు. న్యాయపరంగా ఆర్థికపరంగా అసమానతలు తొలగించి సమానతలను ఏర్పరచడమే లక్ష్యము అని తెలిపారు. కోర్టు ద్వారా ప్రజలకు వివిధ చట్టాలలోని సెక్షన్లు ఎంతగానో ఉపయోగపడతాయని, ప్రజలు చట్టాలపై అవగాహన చేసుకున్నప్పుడే చక్కటి ప్రయోజనం తో పాటు, మంచి భవిష్యత్తు, మంచి జీవన ప్రమాణం పెరిగే అవకాశం ఉందని తెలిపారు.