ఎస్ కే సి. సేవాసమితి వ్యవస్థాపకులు ఎన్. కమలనాథ్.
విశాలాంధ్ర ధర్మవరం:: పదవ తరగతి చదువుతున్న విద్యార్థులకు పరీక్షల కిట్స్ ఎంతో ఉపయోగకరమని ధర్మవరం ఎన్ కే సి. సేవాసమితి వ్యవస్థాపకులు ఎన్. కమలనాథ్ తెలిపారు. ఇందులో భాగంగాఎన్. కమలనాథ్ ఆధ్వర్యంలో డివిజన్ పరిధిలోని రాప్తాడు లో గల కస్తూరిబా విద్యార్థినీలకు పరీక్షల కిట్స్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విశ్రాంత బీసీ వెల్ఫేర్ ఆఫీసర్ అంబారపు రామాంజనేయులు పాల్గొని, చదువు ప్రాధాన్యతను విద్యార్థులకు వివరించారు. తదుపరి కమలనాథ్ రామాంజనేయులు మాట్లాడుతూ ప్రభుత్వ విద్యాసంస్థల్లో చదువుతున్న పేద విద్యార్థులను ప్రోత్సహిస్తే మంచి ఫలితాలు సాధిస్తారని తెలిపారు. పరీక్షల సమయంలో ఈ కిడ్స్ మరింత ఉపయోగకరంగా ఉంటుందని తెలిపారు. పదవ తరగతి ఇంటర్మీడియట్ విద్యార్థులకు ఈ కిడ్స్ పంపిణీ చేయడం నాకెంతో సంతోషంగా ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో రాప్తాడు కేజీబీవీ స్పెషల్ ఆఫీసర్ ముత్యాలమ్మ, పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు.