మండల అధ్యక్షుడు పూర్ణచంద్రరావు
విశాలాంధ్ర – చింతపల్లి(అల్లూరి సీతారామరాజు జిల్లా) :- తెలుగుదేశం పార్టీ పాడేరు నియోజకవర్గం శాసనసభ అభ్యర్థి విషయంలోమన్యవాసులు, తెదేపాశ్రేణులు అపోహలు వీడి ఉత్సాహంగా పనిచేయవలసిన తరుణం ఆసన్నమైందని ఆ పార్టీ మండల అధ్యక్షుడు కిల్లో పూర్ణచంద్రరావు అన్నారు, శనివారం ఆయన మాట్లాడుతూ ఈ ఏడాది జరగబోవు సార్వత్రిక ఎన్నికలలో తెదేపా పాడేరు నియోజకవర్గ అభ్యర్థిగా ఆ పార్టీ పాడేరు నియోజకవర్గ ఇన్చార్జ్, మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి అభ్యర్థిత్వం నూటికి నూరు శాతం ఖరారైనట్లేనని, ఈ విషయంలో ఎటువంటి అనుమానాలకు తావు లేకుండా పార్టీ శ్రేణులంతా రెట్టించిన ఉత్సాహంతో పని చేయవలసిన అవసరం ఉందన్నారు. ఇప్పటికే బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీలో భాగంగా సూపర్ సిక్స్ పథకాలతో పార్టీ శ్రేణులు ప్రజల్లోకి వెళ్లడం జరిగిందన్నారు. ఈ నియోజకవర్గంలో తెదేపా విజయం తద్యమన్నారు. అభ్యర్థుల ఎంపిక విషయంలో ఆశావహులు ఎక్కువగా ఉండటం వలన జరుగుతున్న జాప్యం తప్ప నిత్యం పార్టీ కార్యకర్తలు నిర్వహిస్తూ పార్టీ బలోపేతం కోసం పార్టీ శ్రేణులను కలుపుకుపోతున్న ఇంచార్జ్ గిడ్డి ఈశ్వరే పాడేరు నియోజకవర్గ తెదేపా అభ్యర్థి అని, ఈ విషయంలో పార్టీ శ్రేణులు ఎటువంటి అపోహలకు తావు లేకుండా గిడ్డి ఈశ్వరి విజయానికి కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు.