ధర్మాచార్యులు నక్కల వెంకటేష్
విశాలాంధ్ర ధర్మవరం:: పట్టణంలోని యాదవ వీధి చెరువు కట్ట సమీపంలో గల శ్రీ కోటగడ్డ పెద్దమ్మ తల్లి దేవస్థానానికి తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు వారు ఆలయాల నిర్వహణ కోసం మైక్ సెట్ వితరణ చేయడం జరిగిందని ధర్మాచార్యులు నక్కల వెంకటేష్ తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తిరుమల తిరుపతి దేవస్థానం వారు ఆలయాల నిర్వహణ కోసం మైక్ సెట్ తో పాటు పంచలోహ విగ్రహాలు, రాతి విగ్రహాలు ఊరేగింపు గొడుగులు ఇలా దైవ కార్యక్రమాలకు ఉపయోగించే సామాగ్రిని అతి తక్కువ సబ్సిడీ రేటుతో అందించడం జరుగుతుందని తెలిపారు. అంతేకాకుండా ధార్మిక ఉపన్యాసాలతో పాటు అనేక సేవా కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నామని వారు తెలిపారు. అనంతరం తిరుమల తిరుపతి నుంచి వచ్చిన సామాగ్రిని పూజా కార్యక్రమాలను నిర్వహించారు. తదుపరి నక్కల వెంకటేష్ కు ఆలయ కమిటీ సభ్యులు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు రాంప్రసాద్, కృష్ణవేణి, చంద్రమోహన్ ,సూర్యకళ, దేవప్రసాద్, ఆదినారాయణ, లక్ష్మణ్, జయమ్మ తదితరులు పాల్గొన్నారు.