పలాస మెమూను పొడిగిస్తున్నట్లు ఉత్తర్వులు
- హర్షం వ్యక్తం చేసిన ఎంపీ రామ్మోహన్ నాయుడు
విశాలాంధ్ర – శ్రీకాకుళం టౌన్: జిల్లా ప్రజలు ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తున్న విశాఖపట్నం-బరంపురం రైలుకు రైల్వే అధికారులు ఆమోదం తెలిపారు. ఇప్పటి వరకు విశాఖ-పలాస మధ్య నడుస్తున్న రైలు నంబర్ 08531/08532 (58531/58532) మెమూను ఇచ్ఛాపురం-బరంపురం వరకు కొనసాగిస్తున్నట్లు సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకు ఎంపీ కింజరాపు రామ్మోహన్ నాయుడు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా తూర్పుకోస్తా రైల్వే జీఎం మనోజ్ శర్మ, ఖుర్దా రోడ్ డీఆర్ఎం హెచ్ఎం బజ్వా, ఇతర అధికారులకు కృతజ్ఞతలు తెలియజేశారు. రైలు పొడిగింపుపై రైల్వే మంత్రి అశ్విన్ శ్రీవైష్ణవ్, వివిధ రైల్వే బోర్డు, డివిజన్ సమావేశాల్లో అధికారులను కలిసి, వినతిపత్రాలు అందించినట్లు గుర్తు చేశారు. ప్రతిపాదనలకు ఆమోదం తెలపడంతో జిల్లాకు చెందిన ఉద్యోగులు, చిరు వ్యాపారులకు ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందని ఆకాంక్షించారు. దీనికి సహకరించిన రైల్వే ఉన్నతాధికారులకు ఈ సందర్భంగా ఎంపీ కృతజ్ఞతలు తెలిపారు.