విశాలాంధ్ర ధర్మవరం:: పట్టణంలోని చెరువులో 1.38 లక్షల చేప పిల్లలను ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి వదిలారు. ఈ కార్యక్రమం మత్స్యశాఖ ఆధ్వర్యంలో పి ఎం ఎస్ వై పథకం ద్వారా నిర్వహించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ చెరువులో చేప పిల్లలను వదలడం వలన నాలుగైదు నెలల్లో అవి పెద్దవి కావడంతో పాటు చేప పిల్లల ఉత్పత్తి పెరిగి చెరువు సంఘం సభ్యులకు జీవనోపాధి లభిస్తుందని తెలిపారు. తదుపరి చెరువు సంఘం సభ్యులు ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మత్స్యశాఖ జిల్లా అధికారి చంద్రశేఖర్ రెడ్డి,సహాయ మత్స్యశాఖ పర్యవేక్షకులు జ్యోతి, అసిస్టెంట్ హ్యాపీ బా, సొసైటీ అధ్యక్షులు రాజప్ప, ఉపాధ్యక్షులు లక్ష్మీనారాయణ, సహాయకుడు బోయ శివ, మున్సిపల్ వైస్ చైర్మన్ వేముల జయరామిరెడ్డి, కౌన్సిలర్ పెనుజూరు నాగరాజు నాయకులు తొండ మాల రవి, బోయ నర్సింహులు, వడ్డే శ్రీనివాసులు, రంగుల నారాయణ, నారాయణస్వామి, బోయ రాజా, ఖలీల్ తదితరులు పాల్గొన్నారు.