ఏపీటీఎఫ్ రాష్ట్ర కౌన్సిలర్ బికే ముత్యాలప్ప
విశాలాంధ్ర ధర్మవరం:: పట్టణంలోని పాత తాలూకా కేంద్రం వద్ద ఈనెల 29వ తేదీ 10 గంటలకు జరుగు ధర్నాను విజయవంతం చేయాలని ఏపీటీఎఫ్ రాష్ట్ర కౌన్సిలర్- బికే ముత్యాలప్ప పేర్కొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వ ఉద్యోగుల సమస్యను ప్రభుత్వాలు పరిష్కరించే దిశగా కృషి చేయాలని తెలిపారు. ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్లకు 12వ పిఆర్సి జూలై 2023 నుండి అమలు చేయాలని, 30 శాతం మధ్యంతరం మృతిని వెంటనే ప్రకటించాలని, సి పీ ఎస్ ను రద్దు చేయాలని 11వ పిఆర్సి బకాయిలతో పాటు పిఎఫ్, ఏపీజిఎల్ఐ లోనులు ఇతర బకాయిలను వెంటనే విడుదల చేయాలని వారు డిమాండ్ చేశారు. పెన్షనర్లకు అడిషనల్ క్వాంటం ఆఫ్ పెన్షన్స్ ను 70 నుండి 75 మధ్య వయసున్నవారికి 10 శాతం, 75 నుండి 80 మధ్య వయసు గల వారికి 15 శాతం చెల్లించాలని, పెండింగ్ లో ఉన్న రెండు డిఏలను మంజూరు చేస్తూ, గత డియల బకాయిలను విడుదల చేయాలని తెలిపారు. ఈ సమస్యల పరిష్కారం ఈనెల 29న నిర్వహించే ధర్నాలో అత్యధిక సంఖ్యలో ఉపాధ్యాయులు పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు కె. బలరాముడు ఎస్. రవీందర్ రెడ్డి, రాష్ట్ర కౌన్సిలర్ శ్రీనివాసులు మండల పట్టణ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు ఈశ్వరయ్య, శివానంద, జగదీష్, శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.