టిడిపి రాష్ట్ర కార్యదర్శి కమతం కాటమయ్య
విశాలాంధ్ర ధర్మవరం:: చేనేతల అభివృద్ధి తెలుగుదేశం పార్టీతోనే సాధ్యమవుతుందని టిడిపి రాష్ట్ర కార్యదర్శి క మతం కాటమయ్య, పట్టణ అధ్యక్షులు పరిశే సుధాకర్, మాజీ మున్సిపల్ చైర్మన్ బీరే గోపాలకృష్ణ పేర్కొన్నారు. ఈ సందర్భంగా వారు ఐదవ వార్డులో బాబు షూరిటీ భవిష్యత్తుకు గారిని అనే కార్యక్రమాన్ని నిర్వహించారు.. అనంతరం సూపర్ సిక్స్ అనే పథకాలను ఇంటింటికి వెళ్లి ప్రజలకు వివరించారు. తదుపరి వార్డుల్లో నెలకొన్న సమస్యలు కూడా తెలుసుకుంటూ ముందుకు సాగిపోయారు. అనంతరం వారు మాట్లాడుతూ గత టిడిపి ప్రభుత్వ హయాంలో చేనేతలకు అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి అందరికీ అందించడం జరిగిందని తెలిపారు. నేటి వైయస్సార్సీపి ప్రభుత్వములో తెలుగుదేశం పథకాలను రద్దుచేసి, నేతన్న నేస్తం పథకం కింద 24 వేల రూపాయలు అందిస్తున్నారని, అది కూడా వైసిపి అనుకూలంగా ఉండే వారికి మాత్రమే పంపిణీ చేయడం దారుణమని తెలిపారు. వైసీపీ నాయకుల నిర్వాహక వలన ప్రతిపక్ష పార్టీ నాయకులు అన్ని రకాలుగా ఇబ్బందులు పడ్డారని తెలిపారు. ఏది ఏమైనా వచ్చే ఎన్నికల్లో టిడిపి ప్రభుత్వం తప్పక అధిక మెజార్టీతో గెలుస్తుందని వారు భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో నాయకులు భీమనేని ప్రసాద్ నాయుడు, షీలా మూర్తి, రాళ్లపల్లి షరీఫ్,, గోశాల శ్రీరాములు, మారుతి స్వామి,అంబటి సనత్, బోయ రవిచంద్ర, సోలిగాళ్ళ శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.