విశాలాంధ్ర – పెద్దకడబూరు :(కర్నూలు) : ప్రతి విద్యార్థికి ఆర్థిక అక్షరాశ్యతపై అవగాహన చాలా అవసరమని ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంకు మేనేజర్ రంగప్ప స్పష్టం చేశారు. శుక్రవారం మండల కేంద్రమైన పెద్దకడబూరులోని స్థానిక ఆదర్శ పాఠశాలలో ఏపీజీపి బ్యాంకు మేనేజర్ రంగప్ప ఆధ్వర్యంలో ఆదర్శ పాఠశాల ప్రిన్సిపాల్ రంగన్న అధ్యక్షతన ఆర్థిక అక్షరాశ్యత వారోత్సవాలలో భాగంగా విద్యార్థులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు బ్యాంకు లావాదేవీలు, బ్యాంకింగ్ సేవలు గురించి వివరించారు. బ్యాంకు సేవల పట్ల విద్యార్థులకు అవగాహన తప్పనిసరిగా ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆదర్శ పాఠశాల సిబ్బంది, బ్యాంకు సిబ్బంది పాల్గొన్నారు.