రోటరీ క్లబ్ అధ్యక్ష,కార్యదర్శులు
విశాలాంధ్ర ధర్మవరం:; పోలియో చుక్కతోనే అంగవైకల్యం దూరం అవుతుందని రోటరీ క్లబ్ అధ్యక్షులు జయసింహ, కార్యదర్శి నాగభూషణం, కోశాధికారి సుదర్శన్ గుప్తా తెలిపారు. ఈ సందర్భంగా ప్రభుత్వ ఆసుపత్రిలో తొలుత చిన్నారులకు పల్స్ పోలియో చుక్కలను వేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం అధ్యక్ష కార్యదర్శులు మాట్లాడుతూ గత కొన్ని సంవత్సరాలుగా పల్స్ పోలియో కార్యక్రమాన్ని తాము చేపట్టడం జరుగుతుందని, పల్స్ పోలియో కార్యక్రమానికి ప్రత్యక్షంగా పరోక్షంగా సహాయ సహకారాలు అందించిన వారందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేశారు. మొత్తం 61 కేంద్రాలలో ఈ పల్స్ పోలియో కార్యక్రమం మున్సిపల్ కమిషనర్ రామ్కుమార్ నేతృత్వంలో జరిగిందని తెలిపారు. అనంతరం 400 మంది కు భోజనపు ప్యాకెట్లను వాటర్ ప్యాకెట్స్ కూడా పంపిణీ చేశామని తెలిపారు. ఈ భోజన పంపిణీ దాతలుగా రోటరీ క్లబ్ రిటైర్డ్ శ్రీనివాసరెడ్డి, సుదర్శన్ గుప్తా, సత్రశాల ప్రసన్నకుమార్, సోలిగాళ్ళ వెంకటేశులు టి.ఆర్ రత్నశేఖర్ రెడ్డి, సుదర్శన్ గుప్తా, కొండయ్యలు సహకారం అందించారని తెలిపారు. ఈ కార్యక్రమంలో నరేందర్ రెడ్డి, శివయ్య తదితరులు పాల్గొన్నారు.