విశాలాంధ్ర – పెద్దకడబూరు (కర్నూలు) : మండల పరిధిలోని కల్లుకుంట, మేకడోన, చిన్నకడబూరు, కంబలదిన్నె తదితర గ్రామాల్లో తాగునీటి సమస్య పరిష్కరించాలని సోమవారం ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో ఈఓఆర్డీ జనార్ధన్ కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఏఐవైఎఫ్ తాలూకా అధ్యక్షులు జాఫర్ పటేల్ మాట్లాడుతూ వేసవికాలం సమీపిస్తుందని, దీన్ని దృష్టిలో ఉంచుకుని ఎంపీడీఓ మరియు ఆర్ డబ్ల్యూఎస్ నిర్లక్ష్యం వహించకుండ తాగునీటి సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఎల్ ఎల్ సి కాలువలో నీరు ప్రవహిస్తున్నదని మండలంలో ఉన్న చెరువులు, నీటి కుంటలు, సమ్మర్ స్టోరేజ్ ట్యాంకులు తాగునీటిని నింపి ప్రజలకు, పశువులకు దాహార్తిని తీర్చడానికి చర్యలు తీసుకోవాలని డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని ఈఓఆర్డికి అందజేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు చిన్న రాముడు, తిక్కన్న తదితరులు పాల్గొన్నారు.