ఎమ్మెల్యే అభ్యర్థి బి.ఎస్ మక్బూల్
విశాలాంధ్ర,కదిరి. (శ్రీ సత్యసాయి జిల్లా) రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డిని రెండవసారి ముఖ్యమంత్రిని చేయాలనే సంకల్పంతో ఈనెల 10వ తేదీ ఆదివారం శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి జిల్లా కేంద్రంలోని సాయి ఆరామం వద్ద నిర్వహించే వైఎస్ఆర్సిపి గిరిజన జన గర్జన మహాసభకు నియోజకవర్గంతో పాటు జిల్లాలోని ప్రతి గిరిజన సోదరుడు హాజరయి సభను విజయవంతం చేయాలని కదిరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి బి.ఎస్ మక్బూల్ పేర్కొన్నారు. బుధవారం ఆయన కార్యాలయంలో జిల్లా గిరిజన నాయకులతో కలిసి మహాసభ పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లాలోని ప్రతి గిరిజన సోదరుడు మహాసభకు హాజరయ్యి జగనన్న చేస్తున్న సంక్షేమం, అభివృద్ధిని ప్రతి ఒక్కరికి వివరించాలని కోరారు. అదేవిధంగా రెండోసారి అధికారం చేపట్టాలంటే రాష్ట్రంలోని ప్రతి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించడానికి కృషి చేయాలని వారిని కోరారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సిపి ఎస్.టి రాష్ట్ర జోనల్ ఇంచార్జ్ డుంగావత్ రమేష్ నాయక్, రాష్ట్ర అధికార ప్రతినిధి కే.పీ కుళ్లాయప్ప నాయక్, వైఎస్ఆర్సిపి ఎస్టి జిల్లా అధ్యక్షుడు తిరుపాల్ నాయక్, నల్లమడ ఎంపీపీ ఆంజనేయులు నాయక్, సర్పంచులు చలపతి నాయక్, రమణ నాయక్, వైఎస్ఆర్సిపి నాయకులు భూక్య కృష్ణ నాయక్, రవి నాయక్, వైస్ ఎంపీపీ ఆనంద నాయక్, ఉప సరపంచ్ వసంత నాయక్, శ్రీనివాస్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.