వైకాపా పాడేరు నియోజకవర్గ సమన్వయకర్త విశ్వేశ్వర రాజు
విశాలాంధ్ర – చింతపల్లి (అల్లూరి సీతారామరాజు జిల్లా):- వైకాపాను మళ్ళీ అధికారంలోకి తీసుకువచ్చేందుకు ప్రతి ఒక్కరూ సైనికుల్లా పనిచేయవలసిన తరుణం ఆసన్నమైందని ఆ పార్టీ పాడేరు నియోజకవర్గ సమన్వయకర్త మత్స్యరాస విశ్వేశ్వర రాజు అన్నారు. అంతర్ల గ్రామంలో బుధవారం ఆ పార్టీ శ్రేణులతో సమావేశమైన ఆయన మాట్లాడుతూ మళ్లీ సంక్షేమ పాలన కొనసాగాలంటే రాబోవు సార్వత్రిక ఎన్నికలలో పార్టీ శ్రేణులంతా సిద్ధంగా ఉండటమే గాక, గ్రామ, బూత్ పరిధిలో ప్రతి గడపకు వెళ్లి రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలు, అభివృద్ధి పనులపై ప్రజలకు అవగాహన కల్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆ పార్టీ ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.