ఆదర్శ సేవా సంఘం
విశాలాంధ్ర ధర్మవరం:: దేశ భద్రతల పరిరక్షణలో ప్రాణాలు త్యాగం చేయడం దేశానికి రక్షణ ఇవ్వడమేనని ఆదర్శ సేవా సంఘం వ్యవస్థాపకులు కృష్ణమూర్తి, పద్మనాభయ్య, కార్యదర్శి నాగార్జున, గౌరవాధ్యక్షులు చెన్నా ప్రకాష్, దండు నాగభూషణం, పవన్ కుమార్లు తెలిపారు. ఈ సందర్భంగా జాతీయ భద్రత దినోత్సవం సందర్భంగా పలు విషయాలను ప్రజలకు తెలియజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ దేశం నాకేమీ ఇచ్చింది అనకుండా, దేశానికి తాము ఏమి చేశాము అన్న ఆలోచన ఉన్నప్పుడే రాష్ట్రము, దేశము అభివృద్ధి బాటలో నడుస్తుందని తెలిపారు. దేశ ప్రజల శాంతి భద్రతల పరిరక్షణలో పోలీసులు ఎన్నో త్యాగాలు చేస్తున్నారని, ఆ త్యాగాలు మరువలేనివని తెలిపారు. పోలీసులు, పారా మిలిటరీ బలగాలు, కమాండాలు, గార్డులు, ఆర్మీ అధికారులు, భద్రత పాల్గొన్న ఇతర వ్యక్తులతో సహా రహదారి భద్రత, కార్యాలయ భద్రత, మానవ ఆరోగ్య భద్రత, పర్యావరణ భద్రతతో సహా అన్ని భద్రతా సూత్రాలపై ప్రజలకు అవగాహన కల్పించేందుకే జాతీయ భద్రతా మండలి ఈ సెలవు దినాన్ని ప్రకటించిందని తెలిపారు. అంతేకాకుండా ఏడాది పొడవునా సురక్షితంగా పనిచేయాలని సాధారణ ప్రజల నిబద్ధతను పునరుద్దించడానికి ఉద్దేశించబడిందని తెలిపారు. దేశానికి వివిధ రూపాలలో సేవ చేసే వారందరికీ కూడా దేశ ప్రజలు ఎంతో రుణపడి ఉన్నారని తెలిపారు.