బ్రహ్మకుమారీస్…..
విశాలాంధ్ర – చోడవరం (అనకాపల్లి జిల్లా) : తే.08.03.2024ది. భూమిపై సర్వమానవాళికి సహజ జ్ఞానాన్ని రాజయోగాన్ని ప్రసాదించినది శివ పరమాత్మే అని చోడవరం బ్రహ్మకుమారిస్ అన్నారు. ఓం శాంతి ప్రజాపిత బ్రహ్మకుమారి ఈశ్వరీయ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని శుక్రవారం ప్రజల సందర్శనకు పాల శివలింగాన్ని ప్రతిష్టించారు. మనలో మానవతా విలువలు సుఖశాంతులు పెంపొందించడానికి ఈశ్వరీయ తత్వమే ఆధారమని బ్రహ్మకుమారిస్ తెలియజేశారు. ఈ ఆధ్యాత్మిక శివలింగ సందర్శన లో పలువురు భక్తులు, ప్రముఖులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో బ్రహ్మకుమారిస్ చోడవరం ఇన్చార్జి బీ.కే కృష్ణకుమారి అక్కయ్య, తదితర సోదరి సోదరులు పాల్గొన్నారు