విశాలాంధ్ర, సీతానగరం: మండలంలోని గెడ్డలుప్పి కూడలివద్ద ఉన్న కృషి విధ్యానికేతన్ లో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు.ఆంగ్ల అక్షరాలు ఐ ఓ డి అక్షరాలు తరహాలో విద్యార్థులలంతా కూర్చొని అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఆవశ్యకతను వివరించారు.దీంతోపాటు ఇండియాలో వివిధ రంగాల్లో ప్రప్రధమ మహిళా మణుల చిత్రపటాలను ప్రదర్శించి విద్యార్థులతో వారి జీవితచరిత్రను, విజయాలను చెప్పించడం అందరినీ ఆకట్టుకుంది.నేడు అన్ని రంగాల్లో మహిళల అభివృద్ధిని,వారి యొక్క విశిష్టతను పాఠశాల కరెస్పాండెంటు ద్వారపురెడ్డి. శ్రీనివాసరావు వివరించారు.నేటి పోటీ ప్రపంచంలో బాలికలు కూడా ముందంజలో ఉంటున్నారని తెలిపాడు.మహిళా దినోత్సవం సందర్భంగా డిబేటింగ్ నిర్వహించగా విద్యార్దులు చాలా చక్కగా మాట్లాడారు. పిల్లలు ప్రదర్శన చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నాయి.ఈకార్యక్రమంలో ఉపాధ్యాయ సిబ్బంది, విద్యార్ధినీ విద్యార్ధులు పాల్గొన్నారు