వి ఎస్ వి ఫౌండేషన్ ప్రతినిధులు.
విశాలాంధ్ర ధర్మవరం:: అన్నదానం పరబ్రహ్మ స్వరూపమని వి ఎస్ వి ఫౌండేషన్ ప్రతినిధులు వెంకటనారాయణ, వేణుగోపాల్, పాలగిరి శ్రీధర్, రవికుమార్, నవీన్ తెలిపారు. ఇందులో భాగంగా మహాశివరాత్రి సందర్భంగా పట్టణములోని శివానగర్లో గల బచ్చు నాగంపల్లి శ్రీ కాశీ విశ్వనాథ స్వామి దేవాలయంలో రథోత్సవం సందర్భంగా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించడం మాకెంతో సంతోషంగా ఉందని తెలిపారు. దాదాపు 1000 మంది దాకా అన్నదానం నిర్వహించడం జరిగిందని తెలిపారు. ఈ అన్నదాన కార్యక్రమాన్ని వన్టౌన్ సీఐ సుబ్రహ్మణ్యం చేతులమీదుగా ప్రారంభించడం జరిగిందని వారు తెలిపారు.ఈ కార్యక్రమం పట్ల భక్తులు హర్షం వ్యక్తం చేశారు.