పాడేరు ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి. చింతపల్లి ఎంపీపీ అనూష దేవి.
విశాలాంధ్ర – చింతపల్లి (అల్లూరి సీతారామరాజు జిల్లా): – మన్యంలో మహిళలకు పెద్ద పీట వేసిన ప్రభుత్వం వైకాపా అని పాడేరు ఎమ్మెల్యే కే భాగ్యలక్ష్మి చింతపల్లి ఎంపీపీ కే అనూష దేవి అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని శుక్రవారం వారు మాట్లాడుతూ రాష్ట్రంలోనే గాక, మన్యంలో మహిళలకు అధిక ప్రాధాన్యతనిచ్చిన ఏకైక ప్రభుత్వం వైకాపా అని అన్నారు. నేడు మన్యంలో ఉన్నతాధికారులుగా ఉన్న అల్లూరి జిల్లా కలెక్టర్ విజయ సునీత, సబ్ కలెక్టర్ దాత్రి రెడ్డి, జాయింట్ కలెక్టర్ గా భావన లతో పాటు, ప్రజా ప్రతినిధులుగా అరకు పార్లమెంట్ సభ్యురాలిగా గొడ్డేటి మాధవి, ఉమ్మడి విశాఖ జిల్లా పరిషత్ చైర్మన్ గా జల్లిపల్లి సుభద్ర, పాడేరు నియోజకవర్గ శాసన సభ్యురాలుగా తాను (భాగ్యలక్ష్మి), జి మాడుగుల జడ్పిటిసిగా మత్స్యరాస వెంకటలక్ష్మి, చింతపల్లి, జీకే వీధి ఎంపీపీలుగా కే అనూష దేవి, బి కుమారి, ఇదే క్రమంలో చింతపల్లి మండలంలో 17 పంచాయతీలకు గాను 10 మంది సర్పంచులు మహిళలు ఉన్నారని, అదే క్రమంలో 20 ఎంపీటీసీలకు గాను 12 మంది మహిళలు ఎంపీటీసీలుగా ప్రాతినిధ్యం వహిస్తున్నారని వారు గుర్తు చేశారు. ఈ విధంగా ఏ రంగంలో చూసిన మహిళలకు అధిక ప్రాధాన్యత నిచ్చిన ఏకైక ప్రభుత్వం (వైకాపా) తమదే అన్నారు. ఇటువంటి ప్రభుత్వాన్ని మరలా అధికారంలోకి తీసుకు రావలసిన బాధ్యత మహిళా లోకం పై ఉందని వారు అభిప్రాయం వ్యక్తం చేశారు.