విశాలాంధ్ర గజపతినగరం ( విజయనగరం) : గజపతినగరం సాయి సిద్దార్థ్ డిగ్రీ కళాశాల లో తెలుగుదేశం జనసేన పార్టీ ఉమ్మడి అభ్యర్థి కొండపల్లి శ్రీనివాస్ విద్యార్థులను కలిసి, ఓటు హక్కు ప్రాధాన్యత తెలిపారు. ఓటు ఎందుకు వినియోగించుకోవాలో చెప్తూ ఓటు రాజ్యాంగం కల్పించిన హక్కు. ప్రతి ఒక్కరు తన ఓటును ప్రలోభాలకు గురి కాకుండా నిర్భయంగా వినియోగించుకోవాలని సూచించారు. ప్రజాస్వామ్య బలోపేతానికి అంతా కృషి చేయాలన్నారు. ఓటు హక్కు ఎంతో పవిత్రమైనదనీ,దానికి ఎంతో సార్థకత ఉంటుందని తెలిపారు. విలువైన ఓటును నోటుకు అమ్ముకోవద్దు. ఓటు విలువైన ఆయుధం అని చెప్పడం శ్రీనివాస్ చెప్పారు.రాష్టాన్ని అభివృద్ధి పదం లో నడిపించే నాయకున్ని ఎన్నుకోవాలని విద్యార్థులను కోరారు.. ఈ కార్యక్రమం లో ఎంపీటీసీ సభ్యులు పడాల అప్పలనాయుడు, సర్పంచ్ జానకిరావు, మండల ముఖ్యనాయుకులు పాల్గొన్నారు.