విశాలాంధ్ర ధర్మవరం:: పట్టణంలోని కళాజ్యోతిలో పద్మశ్రీ స్వర్గీయ ఘంటసాల వారి 50వ వర్ధంతి ఉత్సవ వేడుకలు అత్యంత వైభవంగా కళా జ్యోతి కార్యవర్గం నిర్వహించుకున్నారు. ఈ సందర్భంగా పాలు గాయని గాయకులతో పాటు, ధర్మవరం పట్టణంలోని హెచ్.పీ గ్యాస్ గోవింద చౌదరి మనవరాలు, అనంత సేన కీర్తి చౌదరి యొక్క కుమార్తె లక్ష్మీ చౌదరి ఆలపించిన భీష్మ సినిమాలోని “మహాదేవ శంభో”అనే గానం ప్రేక్షకుల్ని ముద్దుల్ని చేసింది. కళాజ్యోతిలో జరిగే ప్రతి కార్యక్రమంలోనూ ఈ చిన్నారి లక్ష్మీ చౌదరి పాల్గొనేటట్లు తల్లిదండ్రులు ప్రోత్సహిస్తున్నారు. అంతేకాకుండా ఈ చిన్నారి అనంతపురంలో మాంటిస్టోరీ ఎలైట్ స్కూల్లో ఐదవ తరగతి చదువుతూ, చదువులోనూ శభాష్ అనిపించుకుంటూ, చిన్న వయసు నుంచే సంగీతములో కర్ణాటక సంగీతం, లలిత సంగీతం తో పాటు కూచిపూడి నృత్యమును కూడా నేర్చు కుంటోంది. చదువుతోపాటు ఖాళీ సమయాల్లో కూడా సంగీతమును అభ్యసనం చేసుకుంటూ, ఆన్లైన్ ద్వారా వచ్చే సంగీత కార్యక్రమాలను కూడా వీక్షిస్తూ ఉంటుందని తల్లిదండ్రులు తెలిపారు. మొత్తం మీద ఈ చిన్నారి పాడిన పాటకు ముద్దులైన కళాజ్యోతి కార్యవర్గం ఘనంగా సత్కరించారు. భారతీయ సంస్కృతి సాంప్రదాయాలను ప్రతి ఒక్కరూ కూడా గౌరవిస్తూ, తమ పిల్లలకు అభ్యసన చేయించినప్పుడే మంచి గుర్తింపు లభిస్తుందని తల్లిదండ్రులు తెలిపారు.