— జిల్లా ఎస్పీ శ్రీ కేకేఎన్ అన్బురాజన్
విశాలాంధ్ర అనంతపురం వైద్యం : కవిత్వమయినా… బోధనలయినా గ్రామీణ స్థాయి ప్రజల మనస్సుల్లో సుస్థిరమైనప్పుడే చరిత్రలో నిలిచిపోతాయని… ఈకోవకు చెందినదే శ్రీ మొల్లమాంబ అని జిల్లా ఎస్పీ కేకేఎన్ అన్బురాజన్ అభిప్రాయపడ్డారు. విలువలతో కూడిన కవిత్వాన్ని సమాజానికి అందించడం ఆమె ప్రత్యేకత, సొంతం అన్నారు. బుధవారం జిల్లా పోలీసు హెడ్ క్వార్టర్స్ లో శ్రీ మొల్లమాంబ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. మొల్లమాంబ చిత్ర పటానికి జిల్లా ఎస్పీ పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈసందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ… రామాయణంను వివిధ భాషలలో ఎందరో రచించారన్నారు. వాల్మీకీ లాంటి మహనీయులు రచించిన రామాయణం గ్రంథాలను ఆధారం చేసుకుని మొల్లమాంబ తనదైన శైలిలో సామాన్యులకు సైతం అర్థమయ్యే తెలుగు బాషలో మొల్ల రామాయణం రాయడం గర్వించదగ్గ విషయమన్నారు. మొల్ల రామాయణంలో కందపద్యాలు ఎక్కువగా ఉంటాయన్నారు. ఈకార్యక్రమంలో అదనపు ఎస్పీలు ఆర్ విజయభాస్కర్ రెడ్డి ( అడ్మిన్),i జి.రామకృష్ణ (సెబ్ )ఎస్ లక్ష్మినారాయణరెడ్డి (ఏ.ఆర్ ), అనంతపురం రూరల్ డీఎస్పీ బి.వి.శివారెడ్డి, జిల్లా పోలీసు కార్యాలయం ఏ.ఒ శంకర్ & సిబ్బంది, ఆర్ ఐ లు రెడ్డెప్పరెడ్డి, రాముడు, పోలీసు అధికారుల సంఘం అడహక్ కమిటీ సభ్యులు సాకే త్రిలోకనాథ్, సుధాకర్ రెడ్డి, గాండ్ల హరినాథ్, తేజ్ పాల్, రమణ, తదితరులు పాల్గొన్నారు.