స్వయంగా ధృవీకరించిన పార్టీ అధినేత చంద్రబాబు
అధికారిక ప్రకటన ఇక లాంఛనమే….
సంబరాల్లో టిడిపి శ్రేణులు…
విశాలాంధ్ర ఏలూరు:దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ టికెట్ పై వస్తున్న సోషల్ మీడియా ప్రచారాలకు చెక్ పడింది.స్వయంగా తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు బుధవారం నాడు టెలిఫోన్ ద్వారా చింతమనేని ప్రభాకర్ తో మాట్లాడారు.
సర్వేలన్ని మీకే అనుకూలంగా ఉన్నాయి, మంచి మెజారిటీ తో గెలవబోతున్నారు. ప్రభుత్వంలో మీకు మంచి స్థానం కూడా ఉండబోతుంది అంటూ చంద్రబాబు తెలిపారు.చింతమనేని బరిలో ఉంటే వైసిపి ఓటమి తధ్యం అని భావించి ఇన్నాళ్లు అసత్య ప్రచారాలు చేసిన దెందులూరు వైసిపి నాయకులు సైతం ఈ వార్తతో ఒక్కసారిగా నిశ్చేష్టులయ్యారు.మరోవైపు చింతమనేని అభ్యర్థిత్వం ఖరారు కావడంతో దెందులూరు నియోజకవర్గ టిడిపి జనసేన శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.