ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల రెండో జాబితాను టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రకటించారు. ఈ జాబితాలో మొత్తం 34 మంది అభ్యర్థుల పేర్లను ప్రకటించారు. దీనిపై పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు స్పందించారు. “రాబోయే 2024 ఎన్నికల్లో టీడీపీ తరఫున పోటీ చేసే అభ్యర్థుల మొదటి జాబితాను ఇప్పటికే ప్రజల ముందు ఉంచడం జరిగింది. ఇప్పుడు మరో 34 మంది అభ్యర్థులతో కూడిన రెండో జాబితాను మీ ముందుకు తీసుకువచ్చాం. అభ్యర్థుల ఎంపికలో ఎప్పటిలాగే, ఈ జాబితాలో కూడా ప్రజల అభిప్రాయాలకు ప్రాధాన్యత ఇచ్చాం” అని వెల్లడించారు. టీడీపీ అభ్యర్థులందరినీ ఆశీర్వదించి గెలిపించాలని రాష్ట్ర ప్రజలను కోరుతున్నానని చంద్రబాబు ట్వీట్ చేశారు.
టీడీపీ అభ్యర్థుల రెండో జాబితాను సోషల్ మీడియాలో పంచుకున్నారు.
నరసన్నపేట ఉ బొగ్గు రమణమూర్తి
గాజువాక ఉ పల్లా శ్రీనివాసరావు
చోడవరం ఉ కేఎస్ఎన్ఎస్ రాజు
మాడుగుల- పైలా ప్రసాద్
ప్రత్తిపాడు ఉ వరుపుల సత్యప్రభ
రామచంద్రాపురం ఉ వాసంశెట్టి సుభాష్
రాజమండ్రి రూరల్ ఉ గోరంట్ల బుచ్చయ్య చౌదరి
రంపచోడవరం (ఎస్టీ) మిర్యాల శిరీష
కొవ్వూరు (ఎస్సి) ఉ ముప్పిడి వెంకటేశ్వరరరావు
దెందులూరు ఉ చింతమనేని ప్రభాకర్
గోపాలపురం (ఎస్సి)- మద్దిపాటి వెంకటరాజు
పెద్దకూరపాడు ఉ భాష్యం ప్రవీణ్
గుంటూరు వెస్ట్ ఉ పిడుగురాళ్ల మాధవి
గుంటూరు ఈస్ట్ ఉ మహమ్మద్ నజీర్
గురజాల ఉ యరపతినేని శ్రీనివాసరావు
కందుకూరు ఉ ఇంటూరి నాగేశ్వరరావు
మార్కాపురం ఉ కందుల నారాయణరెడ్డి
గిద్దలూరు ఉ అశోక్ రెడ్డి
ఆత్మకూరు ఉ ఆనం రాంనారాయణరెడ్డి
కొవ్వురు ఉ వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి
వెంకటగిరి ఉ కురుగొండ్ల లక్ష్మిప్రియ
కమలాపురం ఉ పుత్తా చైతన్య రెడ్డి
ప్రొద్దుటూరు ఉ వరదరాజుల రెడ్డి
నందికొట్కూరు (ఎస్సి) ఉ గిత్తా జయసూర్య
ఎమ్మిగనూరు ఉ జయనాగేశ్వరరెడ్డి
మంత్రాలయం ఉ రాఘవేంద్ర రెడ్డి
పుట్టపర్తి ఉ పల్లె సింధూరారెడ్డి
కదిరి ఉ కందికుంట యశోదా దేవి
మదనపల్లి ఉ షాజహాన్ బాషా
పుంగనూరు ఉ చల్లా రామచంద్రారెడ్డి (బాబు)
చంద్రగిరి ఉ పులివర్తి వెంకట మణిప్రసార్ (నాని)
శ్రీకాళహస్తి ఉ బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి
సత్యవేడు (ఎస్సి) ఉ కోనేటి ఆదిమూలం
పూతలపట్టు (ఎస్సి) ఉ డాక్టర్ కలికిరి మురళి మోహన్ లను టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థులుగా ప్రకటించింది.కాగా తొలి జాబితాలో 94 మంది అభ్యర్థులను ప్రకటించగా.. రెండో జాబితాలో 34 మంది అభ్యర్థులను ప్రకటించింది టీడీపీ. ఇప్పటి వరకూ మొత్తం 128 మంది అభ్యర్థులను ప్రకటించారు చంద్రబాబు నాయుడు. ఇక త్వరలోనే జనసేన, బీజేపీలు తమ అభ్యర్థులను ప్రకటించనున్నాయి.